– జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే
నవతెలంగాణ – జుక్కల్ : గులాబీ దళాన్ని చూసి ఓర్వలేక కాంగ్రెస్ నాయకులు పనికిమాలిన ఆరోపణలు చేస్తున్నారని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే విమర్శించారు. ఈ సందర్భంగా జుక్కల్ మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద ఏర్పాటుచేసిన మొదటి రోజు నిరసన కార్యక్రమంలో భాగంగా పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులకు గులాబీ దళాన్ని చూడగానే మూత్రం పడుతుందని, భయంతో ప్రజల నుండి తమకు ఎక్కడ వ్యతిరేకత వచ్చి తమపై ప్రశ్నల వర్షం కురిపిస్తారని భయంతోనే పిచ్చిప్రాలాపనలతో ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. నిరసన కార్యక్రమం కొనసాగించాలని మేము పోలీసు నుండి అనుమతి తీసుకుంటే టెంట్లు వేయకుండా సభా స్థలంలో ఏర్పాటు చేసిన వాటిని తొలగించడం బాధాకరంగా ఉందని అన్నారు. కాంగ్రెస్ మనుషులు గులాబీ దళాన్ని వ్యతిరేకిస్తే , భగవంతుడు తమకు నీడను ఇవ్వడం జరిగిందని ఎందుకంటే రోజు ఎండలు కాస్తున్న క్రమంలో నేటి ధర్నా కార్యక్రమంలో వాతావరణం చల్లగా ఉండడం భగవంతుని కృప పూర్తిగా గులాబీ దళం వైపు ఉందని మాజీ ఎమ్మెల్యే అన్నారు. వెయ్యి రోజుల పండుగ అని నిర్వహిస్తున్న కాంగ్రెస్ నాయకులకు ఇచ్చిన హామీలు నెరవేర్చక పోవడం చేతకానితనంగా భావిస్తున్నారని ప్రజలలో మొహం పెట్టుకుని పోలేకని తమపై ఆరోపణలు చేయడం వారికి విజ్ఞతకే వదిలేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తో పాటు మండల స్థాయి గ్రామీణ స్థాయి ,గులాబీ దళం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
గులాబీ దళాన్ని చూసి ఓర్వలేక పనికిమాలిన ఆరోపణలు చేస్తున్నారు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



