Monday, April 20, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఫీల్డ్ అసిస్టెంట్ గిరిబాబుకు ఘన సన్మానం

ఫీల్డ్ అసిస్టెంట్ గిరిబాబుకు ఘన సన్మానం

- Advertisement -

నవతెలంగాణ – తిమ్మాజిపేట
మండలంలోని బుద్ధ సముద్రం గ్రామానికి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ గ్రామంలో జరుగుతున్న మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులలో ఎక్కువమందితో పనిచేయించారు. ఆయన ప్రతిభను గుర్తించిన ఎంపీడీవో లక్ష్మీదేవి మండల కేంద్రంలో ఉన్న గ్రామీణ ఉపాధి హామీ కార్యాలయంలో సోమవారం పంచాయతీరాజ్ కమిషనర్ ఆదేశానుసారం ఫీల్డ్ అసిస్టెంట్ గిరిబాబు, టెక్నికల్ అసిస్టెంట్ బాలరాజును శాలువాలతో ఘనంగా సన్మానించారు. అదేవిధంగా గిరిబాబుకు రూ. 1000 నగదు పారితోషకం అందించారు. ఈ సందర్భంగా ఎంపిడిఓ మాట్లాడుతూ.. మండలంలోని అందరూ టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు ఎక్కువమంది లేబర్ చేత పని చేయిస్తే మీ ప్రతిభను గుర్తించి, వారిని సన్మానంతో పాటు రూ.1000 నగదును అందిస్తామని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -