రాష్ట్ర ఐటి శాఖ మంత్రి శ్రీధర్ బాబు
నవతెలంగాణ – మల్హర్ రావు
కాటారం మండలం నస్తురుపల్లి గ్రామంలో నిర్వహించిన రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమానికి భారీగా హాజరై, కార్యక్రమాన్ని విజయవంతం చేసిన పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల, ఇతర జిల్లాల ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల దుద్దిళ్ల శ్రీధర్ బాబు మంగళవారం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీపై ప్రజలు చూపిస్తున్న విశ్వాసం తమకు మరింత బాధ్యతను పెంచిందన్నారు.
అలాగే మంథని నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ అనుబంధ విభాగాల నాయకులు, మహిళా సోదరమణులు, యూత్ కాంగ్రెస్ సోదరులు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించిన జిల్లా అధికారులకు, సిబ్బందికి పోలీస్ శాఖ సిబ్బందికి, డిఎస్బి వాలంటీర్స్ కు, యూత్ కాంగ్రెస్ కార్యకర్తలకు మంత్రి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. వారి సమన్వయం, క్రమశిక్షణ వల్ల కార్యక్రమం విజయవంతంగా పూర్తయ్యిందని అభినందించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ప్రతి ఒక్కరి పాత్ర అభినందనీయమన్నారు. ప్రజల ఆశయాలను నెరవేర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.



