- Advertisement -
– హాజీరైన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు
నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి మండలంలోని చిన్న మల్లారెడ్డి గ్రామంలో ఇందిరమ్మ గృహాల లబ్ధిదారులు నిర్మించుకున్న ఇంటి గృహప్రవేశ కార్యక్రమనికి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గూడెం శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ భీమయ్య లక్ష్మీరాజు గృహ యజమానులను అభినందిస్తూ, ప్రభుత్వం అందిస్తున్న గృహ పథకాల వల్ల పేదలకు సొంత ఇల్లు కలగడం సంతోషకరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మీరాజ గౌడ్, మాజీ సర్పంచ్ రామా గౌడ్, వార్డు మెంబర్ రాము గోపాల్, గ్రామ అధ్యక్షులు కమ్మరి సిద్ధ రాములు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
- Advertisement -


