- Advertisement -
నవతెలంగాణ-ఆలేరు టౌన్: రెండు రోజుల క్రితం ఆలేరులో కోలనుపాక రోడ్డు వద్ద విద్యుత్ పోల్ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. కేవలం వైర్ల సహాయంతోనే తేలియాడుతూ, కూలడానికి సిద్ధంగా పోల్ ఉండడంతో, స్థానికులు విద్యుత్ అధికారులు ఏడి రాజ శేఖర్, ఏఈ వెంకటేష్ దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే విద్యుత్ అధికారులు స్పందించి, నూతన విద్యుత్ స్తంభాన్ని ఏర్పాటు చేశామని తెలియజేశారు. పాత విద్యుత్ పోల్ను తొలగించి, లైన్మెన్ యాదగిరి, రమేష్ ఆధ్వర్యంలో కొత్త విద్యుత్ స్తంభాన్ని ఏర్పాటు చేశారు.
- Advertisement -



