- Advertisement -
నవతెలంగాణ-మల్హర్రావు: మండుతున్న ఎండల నేపథ్యంలో రోజురోజుకూ ఉష్ణోగ్రతలు రికార్డుస్థాయిలో నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు,బాటసారులు దాహార్తి కోసం అల్లాడుతున్నారు.ఈ నేపథ్యంలో మండల కేంద్రమైన తాడిచెర్లలో బుధవారం సర్పంచ్ బండి స్వామి,ఉప సర్పంచ్ బొబ్బిలి రాజు గౌడ్,వార్డు సభ్యుల ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా మాట్లాడారు. మండుతున్న ఎండల దృష్ట్యా ప్రయాణికులు వేసవి తాపానికి గురికాకుండా గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఈ సౌకర్యాన్ని కల్పించామని,ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు ఇందారపు చెంద్రయ్య, సారయ్య,వొన్న తిరుపతి రావు,నారమల్ల రాజేశ్వరి,పైడాకుల దేవేంద్రతోపాటు పలువురు పాల్గొన్నారు.

- Advertisement -



