నవతెలంగాణ – కమ్మర్ పల్లి : మండలంలోని ఉప్లూర్ గ్రామంలో బుధవారం ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకుల బృందం సభ్యులు అడ్మిషన్ డ్రైవ్ నిర్వహించారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 2025-26 విద్య సంవత్సరానికి గాను కళాశాల ప్రిన్సిపాల్ జైపాల్ రెడ్డి ఆదేశాల మేరకు అధ్యాపక బృందం ఉప్లూర్ గ్రామంలో అడ్మిషన్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇటీవల పదవ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థుల ఇండ్లను సందర్శించారు. విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి తమ పిల్లలను ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివించాలని కోరారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శిక్షణ పొందిన అధ్యాపకులు నాణ్యతతో కూడిన విద్యను తమ పిల్లలకు అందిస్తారని వివరించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అడ్మిషన్ పొందడం ద్వారా కలిగే ప్రయోజనాలను తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ప్రభుత్వ కళాశాలలో చదివితే ఉండే లాభాలను, కమ్మర్ పల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉన్న వసతులను విద్యార్థులకు, తల్లిదండ్రులకు వివరించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివించడం ద్వారా వాటిని సద్వినియోగం చేసుకోవాలని విన్నవించారు.ఈ కార్యక్రమంలో అధ్యాపకులు మధు కుమార్, రాజ్ కుమార్, వైష్ణవి, వెంకటేష్, మహేందర్, సంతోష్, తదితరులు పాల్గొన్నారు.
అధ్యాపకుల అడ్మిషన్ డ్రైవ్ ..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES