ఇస్లామాబాద్ : పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికల్లో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్తాన్ తెహ్రిక్ ఇ ఇన్సాఫ్ (పిటిఐ) పార్టీ అన్యూహమైన విజయాలను సాఢించింది. ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఇమ్రాన్ఖాన్ జైలులో ఉండడం…ఎన్నికల్లో పోటీకి ఆయనను అనర్హుడిగా ప్రకటించడం,.. ఆ పార్టీ ఎన్నికల గుర్తును రద్దు చేయడం.. ప్రచారం కూడా సరిగా చేసుకోనివ్వకపోవడం.. ఇన్ని ప్రతికూల పరిస్థితుల మధ్య ఆ పార్టీ ఇతర ప్రధాన పార్టీలను వెనక్కు నెట్టి అత్యధిక స్థానాలు గెలుచుకోవడం విశేషం. ప్రజాస్వామ్యం పట్ల పాక్ ప్రజల్లో పెరుగుతున్న ఆకాంక్షకు ఇదొక నిదర్శనం.