Sunday, June 8, 2025
E-PAPER
Homeరాష్ట్రీయం70 అడుగుల నాలా15 అడుగులకు పరిమితం

70 అడుగుల నాలా15 అడుగులకు పరిమితం

- Advertisement -

ప్యాట్నీసెంటర్‌లో ఆక్రమణల తొలగింపు
ఐదు కాలనీలకు ఊరట
నవతెలంగాణ-సిటీబ్యూరో

హైదరాబాద్‌ నగరంలో కబ్జాదారులు పార్కులను, చెరువులను, నాలాలను సైతం వదలడం లేదు. మురుగు నీరు వెళ్తున్నా కబ్జాచేసి యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు కట్టేస్తున్నారు. స్థానికుల ఫిర్యాదులతో హైడ్రా అలాంటి వాటిపై ప్రత్యేక దృష్టి సారించి, పార్కులు, చెరువులు, ప్రభుత్వస్థలాలను రక్షిస్తోంది. ఈ క్రమంలో సికింద్రాబాద్‌ ప్యాట్నీ సెంటర్‌లో నాలాపై నిర్మించిన వాణిజ్య కట్టడాలను హైడ్రా తొలగించింది. 70 అడుగుల విస్తీర్ణంలో ఉండాల్సిన నాలా కబ్జాలతో 15 నుంచి 18 అడుగులకు పరిమి తమైంది. ప్యాట్నీ నాలా ఆక్రమణకు గురికా వడంతో పైగా కాలనీ, ప్యాట్నీ కాంపౌండ్‌, పాట్నీ కాలనీ, విమాననగర్‌, బీహెచ్‌ఈఎల్‌ కాలనీతోపాటు ఇందిరమ్మ నగర్‌ నీట మునుగుతున్నట్టు హైడ్రాకు ఫిర్యాదులు అందాయి. గతంలో కంటోన్మెంట్‌ అధికా రులకు కూడా ముంపు ప్రాంతాల వారు ఫిర్యాదు చేశారు. గురువారం కంటోన్మెంట్‌ సీఈఓ మధుకర్‌ నాయక్‌, జీహెచ్‌ఎంసీ, ఇరిగేషన్‌ శాఖ అధికారు లతో కలిసి హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ పరిశీలించారు. నాలా ఆక్రమణలతో వేలాది నివా సాలు నీట మునిగిన పాత చిత్రాలను సెల్‌ఫోన్లలో స్థాని కులు కమిషనర్‌కు చూపించారు. అన్ని కోణాల్లో పరిశీలించిన కమిషనర్‌ ఆక్రమణలు తొలగించాలని నిర్ణయం తీసుకున్నారు. భవిష్యత్‌లో ఆక్రమణలకు గురి కాకుండా వెంటనే హద్దులు నిర్ణయించి నాలాకు ఇరువై పులా ప్రహరీలు నిర్మించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా శుక్రవారం ఉదయమే నాలా ఆక్రమణల కూల్చివేతలు ప్రారంభించారు.
ఊపిరి పీల్చుకుంటున్న ఐదు కాలనీల వాసులు
నాలాపై అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు తొలగించడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. నాలా ఆక్రమణలు జరిగితే కూల్చివేయాలన్న హైకోర్టు, సుప్రీం కోర్టు తీర్పులు అమలవుతు న్నందుకు ఆనం దం వ్యక్తం చేశారు. కోర్టు కేసులున్నా యంటూ కాలయాపన లేకుండా హైడ్రా చర్యలు చేపట్టడం సంతోషకర మన్నారు. 20 నుంచి 30 ఏండ్లుగా నీట మునుగుతున్న కాలనీల ఇబ్బందులు తొలగుతున్నాయంటూ హర్షం వ్యక్తం చేశారు. దాదాపు 30 వేల కుటుం బాలకు ఊరటని చ్చారని హైడ్రాకు అభినం దనలు తెలిపారు. హస్మత్‌పేట చెరువు వరద నీటిని తెచ్చే హస్మత్‌పేట నాలా, మహేంద్ర హిల్స్‌పై భాగం నుంచి వరద నీటిని తెచ్చే పికెట్‌నాలా 23 కిలోమీటర్ల మేర ప్రయాణించి ప్యాట్నీ పరిసరాల్లో కలుస్తుంది. అక్కడ కొందరు కబ్జా చేయడంతో 15 నుంచి 18 అడుగులకు పరిమితం అయిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. హైడ్రా చర్యలతో ఉపశమనం కలిగిందన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -