అత్యున్నత పరిశోధనా సంస్థలను నెలకొల్పారు
ఖగోళ శాస్త్రానికి ఎనలేని సేవలు అందించారు
ఆయన లేని లోటు భారత వైజ్ఞానిక రంగానికి తీరని లోటు
జయంత్ నర్లికార్ జీవిత విశేషాలు సమావేశంలో వక్తలు
నవతెలంగాణ – ముషీరాబాద్
దేశంలో అత్యున్నత పరిశోధనా సంస్థలను నెలకొల్పిన మహౌన్నతమైన వ్యక్తిగా జయంత్ నర్లికర్ నిలిచారని, గురుత్వాకర్షణ సిద్ధాంతంతో అంతర్జాతీయ ఖ్యాతి పొంది ఖగోళ శాస్త్రానికి ఎనలేని సేవలు అందించారని పలువురు వక్తలు వివరించారు. డాక్టర్ జయంత్ నర్లికర్ జీవిత విశ్లేషాలపై శనివారం జన విజ్ఞాన వేదిక అధ్యక్షులు చెలిమల రాజేశ్వరరావు ఆధ్వర్యంలో హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రముఖ సైన్స్ రైటర్ డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ మాట్లాడుతూ.. 1938 జులై 19న జన్మించిన డాక్టర్ నర్లికర్ బనారస్ హిందూ యూనివర్సిటీ (బీహెచ్యూ) క్యాంపస్లో తొలి దశ విద్యను అభ్యసించారని తెలిపారు. ఆయన తండ్రి విష్ణు వాసుదేవ నర్లికర్ అదే యూనివర్సిటీలో ప్రొఫెసర్గా, గణితశాస్త్ర విభాగాధిపతిగా సేవలందించారని చెప్పారు. ఉన్నత విద్య కోసం కేంబ్రిడ్జ్కి వెళ్లిన డాక్టర్ నర్లికర్.. మ్యాథమెటికల్ ట్రిపోస్లో వ్రాంగ్లర్ అండ్ టైసన్ పతక విజేతగా నిలిచారన్నారు. బ్రిటన్లో ఉన్నప్పుడే తన డాక్టోరల్ అడ్వైజర్ ఫ్రెడ్ హూయల్తోపాటు ప్రఖ్యాత శాస్త్రవేత్తలతో కలిసి ప్రఖ్యాత హూయల్-నార్లికర్ గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని రూపొందించి 1972లో భారత్కు తిరిగొచ్చి టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రిసెర్చ్లో చేరారని వివరించారు.
ఉస్మానియా యూనివర్సిటీ అస్త్రోనో డాక్టర్ జె.రుక్మిణి మాట్లాడుతూ.. డాక్టర్ నర్లికర్ ప్రభావం విద్యారంగానికి మించి విస్తరించిందన్నారు. ఆయన ఒక ఉద్వేగఫలితమైన సైన్స్ కమ్యూనికేషన్ కలిగిన వ్యక్తి అని కొనియాడారు. ఇంగ్లీష్ కమ్యూనికేషన్లో అనేక పుస్తకాలు, వ్యాసాలు రచించారన్నారు. ఆకర్షణీయమైన సైన్స్ ఫిక్షన్ రచనలు రేడియో టెలివిజన్లో కనిపించడం వల్ల భారతీయుల ఇండ్లలో శాస్త్రీయ ఆలోచన వచ్చిందని, ప్రజాశాస్త్ర విద్య పట్ల ఆయన నిబద్ధతకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించిందని అన్నారు. 1996లో ఆయన సైన్స్ కమ్యూనికేషన్ కోసం యునెస్కో కళింగ బహుమతిని అందుకున్నారని తెలిపారు. డాక్టర్ కె.శ్రీరాము మాట్లాడుతూ.. జయంత్ నర్లికర్ ఫ్రెడ్ హౌయల్తో కలిసి హౌయల్ నర్లికర సిద్ధాంతమని పిలవబడే ఒక కన్ఫార్మల్ గురుత్వాకర్షణ నమూనాను ప్రతిపాదించారని గుర్తు చేశారు.
వెల్లోన్ కాస్మాలజిస్ట్ డాక్టర్ ఎమ్ఎస్ సీమ పురాన్చంద్ మాట్లాడుతూ.. జయంత్ నర్లికర్ కేంబిడ్జ్రి యూనివర్సిటీలో ఫెడ్ పోయెని అనే సైంటిస్ట్ వద్ద పనిచేశారని తెలిపారు. ఆయనకు హిందుస్థానీ సంగీతం అంటే మక్కువ అని, ఐయూసీకేఏ సెంట్రల్ యూనివర్సిటీలో ఆస్ట్రానమీ ఆస్ట్రో ఫిజిక్స్ను స్థాపించి డైరెక్టర్గా పని చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సైన్స్ కమ్యూనికేషన్ సబ్ కమిటీ కన్వీనర్ ప్రొఫెసర్ రామచంద్రయ్య, జన విజ్ఞాన వేదిక ప్రధాన కార్యదర్శి రాజా కమిటీ సభ్యులు ప్రొఫెసర్ బి.యన్.రెడ్డి, ప్రొఫెసర్ కోయ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
మహౌన్నతమైన వ్యక్తి జయంత్ నర్లికర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES