గొంది కిరణ్: ములుగు నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు
నవతెలంగాణ – గోవిందరావుపేట : సుమారు 15 సంవత్సరాల తర్వాత ప్రజలు తిరిగి ఇందిరమ్మ గృహాలను నిర్మించుకుంటున్నారని ములుగు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు గొంది కిరణ్ అన్నారు. ఆదివారం మండలంలోని పసర గ్రామంలో పలువురు ఇందిరమ్మ గృహ లబ్ధిదారులకు గృహాల నిర్మాణ పనులను కిరణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడుతూమంత్రీ వర్యులు సీతక్క ఆదేశాలమేరకు జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ సూచనమేరకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ కార్యక్రమానికి శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులైన భూక్య విజయ, గొంది అక్షర, మల్యాల ఈశ్వరి, సుడి వెంకట్ రెడ్డి మరియు తదితరుల ఇండ్ల నిర్మాణ కార్యక్రమాలకు శంకుస్థాపన చేయగా లబ్ధిదారులు సంతోషంతో ఉన్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో, బీసీ సేల్ మండల అధ్యక్షులు కడబోయిన రవి, పస్ర గ్రామ యూత్ అధ్యక్షులు కొల్లు శ్రీనివాస్ రెడ్డి మరియు గ్రామ ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు యూత్ నాయకులు తదితరులు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
పసరలో ఇందిరమ్మ ఇండ్లకు శంకుస్థాపన..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES