Tuesday, June 10, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రభుత్వ జూనియర్ కళాశాలను సద్వినియోగం చేసుకోవాలి..

ప్రభుత్వ జూనియర్ కళాశాలను సద్వినియోగం చేసుకోవాలి..

- Advertisement -

నవతెలంగాణ – కమ్మర్ పల్లి  : మారుమూల గ్రామాల ప్రజలకు ఇంటర్ విద్యను అందించే లక్ష్యంతో మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ జూనియర్ కళాశాలను కాపాడుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని కళాశాల అధ్యాపకులు పేర్కొన్నారు. సోమవారం ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకుల బృందం సభ్యులు నాగాపూర్, హస కొత్తూర్ గ్రామాల్లో అడ్మిషన్ డ్రైవ్ నిర్వహించారు. ఆయా గ్రామాల్లో ఇటీవల పదవ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థుల ఇండ్లను సందర్శించారు. విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి తమ పిల్లలను ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేర్పించి, చదివించాలని కోరారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శిక్షణ పొందిన అధ్యాపకులు నాణ్యతతో కూడిన విద్యను తమ పిల్లలకు అందిస్తారని వివరించారు.ప్రభుత్వ కళాశాలలో చదివితే ఉండే లాభాలను, కమ్మర్ పల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉన్న వసతులను, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అడ్మిషన్ పొందడం ద్వారా కలిగే ప్రయోజనాలను తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివించడం ద్వారా వాటిని  సద్వినియోగం చేసుకోవాలని కోరారు.కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు వెంకటేష్, గంగాధర్, రాజకుమార్, గంగారం, శ్రీహరి, వైష్ణవి, స్వాతి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -