భీంగల్ ఏసిడిపిఓ జ్ఞానేశ్వరి
నవతెలంగాణ-కమ్మర్ పల్లి : అర్హులైన రెండున్నర సంవత్సరాలు దాటిన చిన్నారులను తప్పకుండా తల్లిదండ్రులు అంగన్వాడి కేంద్రాలకు పంపించాలని భీంగల్ ఏసిడిపిఓ జ్ఞానేశ్వరి అన్నారు. బుధవారం మండలంలోని హాస కొత్తూర్ గ్రామంలోని అంగన్వాడి కేంద్రంలో నిర్వహించిన అమ్మ మాట-అంగన్వాడి బాట కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారుల తల్లులను ఉద్దేశించి ఆమె మాట్లాడారు. తమ చిన్నారులను రెండున్నర సంవత్సరాల దాటిన వెంటనే తప్పకుండా అంగన్వాడి కేంద్రాలకు పంపించాలని, ప్రైవేట్ పాఠశాలలకు పంపించొద్దని సూచించారు. అంగన్వాడి కేంద్రాలకు పంపించడం ద్వారా చిన్నారులకు నాణ్యతతో కూడిన పౌష్టికాహారం అందుతుందన్నారు. అంగన్వాడి కేంద్రం ద్వారా చిన్నారులకు, గర్భిణులకు, బాలింతలకు అందించే అన్ని రకాల సేవలు గురించి అవగాహన కల్పించారు. అమ్మ మాట-అంగన్వాడి బాట కార్యక్రమం సందర్భంగా అంగన్వాడి కేంద్రాలను చిన్నారులను, తల్లిదండ్రులను ఆకర్షించేలా మామిడి తోరణాలతో అందంగా అలంకరించారు. అంగన్వాడి కేంద్రంలో అందరి సమక్షంలో సరస్వతి దేవి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నర్సయ్య, గ్రామస్థాయి అధికారులు, ప్రజా ప్రతినిధులు, అంగన్వాడీ టీచర్లు, ఏఎన్ఎం, ఆశా కార్యకర్తలు, అంగన్వాడి ఆయాలు, చిన్నారుల తల్లులు, తదితరులు పాల్గొన్నారు.
అర్హులైన చిన్నారులను అంగన్వాడికి పంపించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES