- Advertisement -
- – జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సిహెచ్ మధుసూదన్
- నవతెలంగాణ-భూపాలపల్లి
- లింగ నిర్ధారణ పరీక్ష చేయడం చట్టరీత్యా నేరమని పరీక్ష చేయించిన, చేసిన , ప్రోత్సహించిన శిక్షార్హులు అవుతారని జయశంకర్ భూపాలపల్లి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మధుసూదన్ స్పష్టం చేశారు. గురువారం జిల్లా కేంద్రంలోని వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జిల్లా అడ్వైజరీ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ… జిల్లాలో ప్రస్తుతం 14 స్కానింగ్ సెంటర్లు ఉన్నాయని, ఇందులో ఐదు ప్రభుత్వాధీనంలో 9 ప్రైవేట్ సెంటర్లు పనిచేస్తున్నాయని తెలిపారు. లింగ నిర్ధారణ పరీక్షల నిరోధంపై దృష్టి పెట్టాలన్నారు. పరీక్షలు చేయకూడదని లింగ నిర్దారణ పరీక్ష నిషేధ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించాలని, అలా చేసిన చేయించి ప్రోత్సహించిన వారికి మూడేళ్లు జైలు శిక్షతోపాటు 50 వేల జరిమానా విధిస్తారని తెలిపారు. ఎవరైనా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే 944058698 2, నంబరుకు లేదా 630 323 9891 నంబరుకు వాట్స్అప్ చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ శ్రీదేవి, గైనకాలజిస్టు డాక్టర్ కవిత, పీడియాట్రిషన్ డాక్టర్ సురేందర్, డెమో శ్రీదేవి, సోషల్ వర్కు ర్లు మొదలగు వారు పాల్గొన్నారు.
- Advertisement -