- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: తార్నాకలోని ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ హాస్టల్ మెస్ ను గత రెండు రోజులుగా మూసివేశారని విద్యార్థులు తెలిపారు. ఈ విషయమై నిజాం కళాశాల ప్రిన్సిపల్ ను సంప్రదించగా.. నిధుల కొరతతో మెస్ ను మూసివేసినట్లుగా తెలిపారు. అది అటానమస్ కలిగిన కళాశాల అని, ఓయూకు దానికి ఎలాంటి సంబంధం లేదని వీసీ కుమార్ వెల్లడించారు. రెండు రోజులుగా హస్టల్ లో ఫుడ్ లేక ఆకలితో అలమటిస్తున్నామని విద్యార్ధులు ఆవేదనతో తెలిపారు.
- Advertisement -