నవతెలంగాణ – కంఠేశ్వర్ : నిజామాబాద్ జిల్లా కోర్టులో శనివారం జాతీయ లోక్ అదాలత్ జరిగింది. ఇందులో రోడ్డు ప్రమాద కేసులో చనిపోయిన బాధిత కుటుంబానికి రూ.90లక్షలు చెల్లించడానికి చోళ మండలం ఇన్సూరెన్స్ కంపెనీ అగీకరించి జిల్లా జడ్జి జి వి ఎస్ భారత లక్మి నాల్గవ అదనపు జిల్లా జడ్జి హర్ధ చేతుల మీదుగా అవార్డ్ కాపీని బాధిత కుటుంబానికి అందచేసారు. ఇందల్వాయ్ గ్రామానికి చెందిన జెన్కో (JENCO) ఉద్యోగి బదావత్ ప్రేమ దాస్ పిబ్రవారి 2023 సంవత్సరంలో జరిగిన రోడ్డు ప్రమాద ఘటన మరణించడంతో వారి కుటుంబ సభ్యులకు నష్ట పరిహారంగా చోళ మండలం ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా పొందడం జరిగింది. ఈ కార్యక్రమంలో న్యాయ సేవ సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి ఉదయ్ భాస్కర్, ఇన్సూరెన్స్ కంపెనీ న్యాయవాది సదానంద్ గౌడ్, న్యాయ సేవ సంస్థ సిబ్బంది, న్యాయవాదులు, కక్షిదారులు, తదితరులు పాల్గొన్నారు.
జాతీయ లోక్ అందాలత్ లో రూ.90 లక్షల పరిహారం చెల్లింపు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES