నవతెలంగాణ – నెల్లికుదురు: మండలంలోని ఎర్రబెల్లి గూడెం గ్రామానికి చెందిన గాదే అఖిల్ ఐఐటి లో ఆల్ ఇండియా ఎస్సీ క్యాటగిరీలో 2032 ర్యాంక్ సాధించిన గాదే అఖిల్ కు శాలతో ఘనంగా సన్మానం ఆదివారం నిర్వహించారు. సన్మానంలో పాల్గొన్న మండల మాజీ వైస్ ఎంపీపీ జల్ల వెంకటేష్ తొర్రూర్ వ్యవసాయ మార్కెట్ మాజీ వైస్ చైర్మన్ జిలకర యాలాద్రి బ్రాహ్మణ కొత్త పెళ్లి మాజీ ఎంపీటీసీ జల్ల పరశురాములు ఎర్రబెల్లి గూడెం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పొనుగోటి కిషన్ రావు ఎర్రబెల్లి గూడెం బిజెపి గ్రామ అధ్యక్షులు జీలకర్ర యాకయ్య ఎమ్మార్పీఎస్ నెల్లికుదురు మండల ప్రధాన కార్యదర్శి వంగాల ఈశ్వర్ యువజన సంఘాల అధ్యక్షుడు కెక్కర్ల వెంకటేష్ వంగాల మైసమ్మ జర్నలిస్ట్ గాదె కృష్ణ తదితరులు పాల్గొన్నారు .
ఐఐటీలో 2012 ర్యాంకు సాధించిన విద్యార్థికి సన్మానం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES