Monday, June 16, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంజులై 9 దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి

జులై 9 దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి

- Advertisement -

– సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేష్‌
నవతెలంగాణ-సిటీబ్యూరో

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక, ఉద్యోగ, రైతాంగ, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా జులై 9న జరగనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కార్మిక వర్గానికి సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేష్‌ పిలుపునిచ్చారు. సీఐటీయూ గ్రేటర్‌ హైదరాబాద్‌ సెంట్రల్‌ సిటీ కమిటీ ఆధ్వర్యంలో గోల్కొండ చౌరస్తాలోని ఆ సంఘం నగర కార్యాలయంలో జరిగిన సీఐటీయూ సమావేశంలో ఆయన మాట్లాడారు. మోడీ ప్రభుత్వం కార్మికులకు సంబంధించిన 29 చట్టాలను 4 లేబర్‌ కోడ్లుగా మార్చి 8 గంటల పనిదినం స్థానంలో 12 గంటలు పని దినాన్ని ప్రవేశపెడుతున్నదని విమర్శించారు. కార్మికులను ఎప్పుడంటే అప్పుడు తొలగించుకునే స్వేచ్ఛను యజమానులకు కట్టబెట్టారన్నారు. కార్మికులు కనీస వేతనం రూ 26వేలు అడుగుతుండగా మోడీ ప్రభుత్వం మాత్రం ఫ్లోర్‌ లెవెల్‌ వేజ్‌ రూ.178గా నిర్ణయం చేసిందని తెలిపారు. కాంట్రాక్టు వ్యవస్థను రద్దుచేసి కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్‌ చేయాలని అడుగుతుంటే మోడీ ప్రభుత్వం ఫిక్స్డ్‌ టర్మ్‌ ఎంప్లాయిమెంట్‌ పద్ధతిని తీసుకువచ్చి కార్మికులకు ఉద్యోగ భద్రత లేకుండా చేస్తున్నదన్నారు. సీఐటీయూ నగర కార్యదర్శి ఎం. వెంకటేష్‌ మాట్లాడుతూ.. అన్ని విభాగాల్లో మహిళలు రాత్రిపూట పనిచేసే విధంగా చట్టాలను సవరించారని విమర్శించారు. నాలుగు లేబర్‌ కోడ్స్‌ వల్ల పీఎఫ్‌ చట్టం ప్రమాదంలో పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో సీఐటీయూ నగర ఉపాధ్యక్షులు మల్లేష్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -