Monday, June 16, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంవిమాన ప్రమాద మృతులకు నైటా సంతాపం

విమాన ప్రమాద మృతులకు నైటా సంతాపం

- Advertisement -

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
అహ్మదాబాద్‌ దుర్ఘటనలో చనిపోయిన మృతుల కుటుంబాలకు న్యూయార్క్‌ తెలంగాణ తెలుగు అసోసియేషన్‌ (నైటా) తీవ్ర సంతాపం తెలిపింది. ఆదివారం న్యూయార్క్‌లో నైటా అధ్యక్షురాలు వాణి అనుగు ఆధ్వర్యంలో కార్యవర్గం, సభ్యులు మృతులకు నివాళులు అర్పించారు. ఎయిర్‌ ఇండియా విమాన ప్రమాదం ఎన్‌ఆర్‌ఐలను తీవ్రంగా కలిచివేసిందని తెలిపారు. విదేశాల్లో ఉంటున్న భారతీయుల సంఖ్య భారీగా పెరిగిందనీ, వారంతా భారతదేశం రాకపోకలకు తరచుగా ఎయిర్‌ ఇండియా విమానాల్లో ప్రయాణించేందుకు ప్రాధాన్యత ఇస్తారని తెలిపారు. ఎన్‌ఆర్‌ఐల్లో ఆత్మవిశ్వాసం నింపాలంటే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలను పునారావృతం కాకుండా తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -