- Advertisement -
నవతెలంగాణ-రామగిరి : రామగిరి మండలంలోని ఆదివారంపేట గ్రామ బస్టాండ్ లో చీకటి పడితే అంధకారం నెలకొంది. ఈ మేరకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు సోదరుడు, దుద్దిల్ల శ్రీనుబాబు టీపీసీసీ జనరల్ సెక్రెటరీగా పార్టీ బాధ్యతలు తీసుకున్న మొదటిసారి మండలంలోని ఆదివారం పేట గ్రామ బస్టాండ్ వద్దకు రాగా… చీకటిగా ఉండడంతో గ్రామ కాంగ్రెస్ నాయకులను చీకటిగా ఉండడానికి కారణాలను తెలుసుకున్నారు. సంబంధిత ఎన్పీడీసీఎల్ అధికారుల సమాచారం ఇవ్వాలని అన్నారు ఈ మేరకు ఎన్పీడీసీఎల్ అధికారులు వెంటనే స్పందించి లైట్లు ఏర్పాటు చేయాలని గ్రామ కాంగ్రెస్ నాయకులు విద్యుత్ అధికారులను కోరారు.
- Advertisement -