Tuesday, June 17, 2025
E-PAPER
Homeక్రైమ్చెట్టును ఢీ కొట్టిన కారు

చెట్టును ఢీ కొట్టిన కారు

- Advertisement -

– ఇద్దరు మృతి.. ముగ్గురికి గాయాలు
నవతెలంగాణ-ఉట్నూర్‌

ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూర్‌ మండలంలోని బీర్సాయిపేట్‌ గండి అటవీ ప్రాంతంలో సోమవారం ఉదయం కారు అదుపుతప్పి చెట్టుకు ఢీకొీట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. 108 అంబులెన్స్‌ ఈఎంటీ జాన్‌, పైలెట్‌ శంకర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్‌ పట్టణంలోని రిక్షా కాలనీకి చెందిన వారు బెల్లంపల్లి నుంచి కారులో ఆదిలాబాద్‌ వైపు వస్తుండగా బిర్సాయిపేట్‌ గండి మూలమలుపు వద్ద కారు అదుపుతప్పి చెట్టుకు ఢకొీంది. ఈ ఘటనలో ఈర్ల షహరిష్‌(16), గంట విజయ(50) కారులోనే మృతిచెందారు. గాయపడిన ఆద్య పరిస్థితి విషమంగా ఉండటంతో ఉట్నూర్‌ ఆస్పత్రికి 108లో తరలించారు. ప్రథమ చికిత్స చేసి ఆదిలాబాద్‌ రిమ్స్‌కు తీసుకెళ్లారు. సుచరిత, రాజులకు స్వల్ప గాయాలయ్యాయి. వారిని ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌, టీపీసీసీ ఉపాధ్యక్షులు ఆత్రం సుగుణ, మానవ హక్కుల వేదిక రాష్ట్ర నాయకులు ఆత్రం భుజంగరావు, కాంగ్రెస్‌ ఎస్టీ సెల్‌ రాష్ట్ర నాయకులు సునీల్‌ జాదవ్‌ పరామర్శించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -