– భారీగా మోహరించిన పోలీసు, సింగరేణి అధికారులు
– సమస్యలు పరిష్కరించాకే పనులు చేపట్టాలని డిమాండ్
నవతెలంగాణ-ఇల్లందు
సమస్యలు పరిష్కరించాకనే పనులు చేపట్టాలంటూ ఓసీ పనులను సోమవారం అఖిలపక్షం నేతలు అడ్డుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలో జేకే ఓసీ విస్తరణ కోసం సింగరేణి అధికారులు పూసపల్లి అడివి, పొలాల్లో డోజర్తో పనులు చేస్తున్నారు. విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న సాగుదారులు అఖిలపక్షం నాయకులకు చెప్పారు. వెంటనే అఖిలపక్షం నాయకులు పని ప్రదేశానికి చేరుకున్నారు. అప్పటికే సింగరేణి ఎస్ఓటు జీఎం రామస్వామి, ప్రాజెక్ట్ అధికారి, సెక్యూరిటీ అధికారి అంజిరెడ్డి, ఇల్లందు ఎస్ఐ హసీనా వారి పోలీస్ సిబ్బంది, ఎస్అండ్పీసీ సెక్యూరిటీ సిబ్బంది, రెవెన్యూ ఇన్స్పెక్టర్ కామేశ్వరరావు భారీ స్థాయిలో మోహరించారు. ఈ సందర్భంగా అఖిలపక్షం నాయకులు మాట్లాడుతూ.. నిర్వాసితులకు 2013 చట్ట ప్రకారం పరిహారం చెల్లించాలని, సింగరేణి క్వార్టర్లలో నివసిస్తున్న వారికే అప్పగించాలని అన్నారు. ఓసీ ప్రభావిత ప్రాంతాల్లో తాగు నీరు, పారిశుధ్యం, రోడ్లు, డ్రయినేజీ పనులు, ఇందిరమ్మ ఇండ్లు సింగరేణి సంస్థ ద్వారానే నిర్మించాలని కోరారు. నిర్వాసితులకు ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధిని కూడా సింగరేణి సంస్థ మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. పై సమస్యలు పరిష్కరించకుండా ఓసీ పనులను సాగనివ్వబోమని హెచ్చరించారు. డోజర్ ఎదుట నిలబడి నిరసన తెలిపారు. దాంతో సింగరేణి అధికారులు, పోలీస్, రెవెన్యూ అధికారులు వెను తిరిగి వెళ్లారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నేతలు అబ్దుల్ నబి, పూనెం సురేందర్, మంచాల వెంకటేశ్వర్లు, వెన్నంపల్లి శ్రీనివాస్, హరికృష్ణ, దనసరి రాజు, తాండ్ర నాగరాజు, సదరం మహేష్, చందవత్ రమేష్, గుళ్ళ మొగిలి, గుళ్ళ సదయ్య, లాలు, సత్యనారాయణ, రాజు తదితరులు పాల్గొన్నారు.
ఓసీ పనులను అడ్డుకున్న అఖిలపక్షం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES