Wednesday, June 18, 2025
E-PAPER
Homeదర్వాజ22న మౌనశ్రీ మల్లిక్ కవితా సంపుటి చలన కాంక్ష ఆవిష్కరణ సభ

22న మౌనశ్రీ మల్లిక్ కవితా సంపుటి చలన కాంక్ష ఆవిష్కరణ సభ

- Advertisement -

నవతెలంగాణ -హైదరాబాద్ : చలన కాంక్ష తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, ఉదయ సాహితి సంస్థల ఆధ్వర్యంలో ప్రముఖ సినీ గీతా రచయిత మౌనశ్రీ మల్లిక్ కవితా సంపుటి చలన కాంక్ష ఆవిష్కరణ సభ ఈ నెల 22న సాయంత్రం 6గంటలకు రవీంద్ర భారతి సమావేశ మందిరంలో జరగనుంది. ప్రముఖ సినీ గేయ రచయిత, జాతీయ పురస్కార గ్రహీత సుద్దాల అశోక్ తేజ అధ్యక్షతన జరగనున్న ఈ సభలో ముఖ్య అతిథిగా, గ్రంథావిష్కర్తగా తెలంగాణ రాష్ట్ర గీతకర్త, లోకకవి అందెశ్రీ , విశిష్ట అతిథులుగా తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డా॥ మామిడి హరికృష్ణ, గౌరవ అతిథిగా ప్రముఖ సాహితీవేత్త, రాష్ట్ర గౌరవాధ్యక్షులు, ఉదయ సాహితి-తెలంగాణ దాస్యం సేనాధిపతి, ఆత్మీయ అతిథిగా నేటినిజం దినపత్రికసంపాదకులు బైస దేవదాస్ , ప్రత్యేక అతిథిగా ఉస్మానియా విద్యాలయ అసిస్టెంట్ ప్రొఫెసర్, ప్రముఖ విమర్శకులు డా॥ ఎస్. రఘు పాల్గొననున్నారు.‌ ముంబై కి చెందిన ప్రముఖ కవి దేవానంద్ నాగెల్ల కృతి స్పీకర్తగా హాజరవుతారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -