Wednesday, June 18, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పరిశీలించిన అడిషనల్ కలెక్టర్

డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పరిశీలించిన అడిషనల్ కలెక్టర్

- Advertisement -


నవతెలంగాణ – భిక్కనూర్
భిక్కనూరు పట్టణ కేంద్రంలోని డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అడిషనల్ కలెక్టర్ విక్టర్ మంగళవారం పరిశీలించారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వ సమయంలో లబ్ధిదారులను ఎంపిక చేసి నివాసానికి అనుగుణంగా సమస్యలు పరిష్కరించకపోవడంతో నిరుపయోగంగానే ఉన్న కారణంగా సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు, ఎంపిక చేసిన లబ్ధిదారులు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అడిషనల్ కలెక్టర్ పరిశీలించి త్వరలోనే సమస్యలు పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. మాజీ సర్పంచ్ తునికి వేణు అడిషనల్ కలెక్టర్ తో మాట్లాడుతూ విద్యుత్, మంచినీటి సదుపాయం, నివాసానికి అనుగుణంగా అన్ని సౌకర్యాలు కల్పించాలని, ఎంపిక చేసిన లబ్ధిదారులకు ఇబ్బందులు లేకుండా సమస్యలు పరిష్కరించాలని కోరారు. అనంతరం ఎంపిక చేసిన లబ్ధిదారులు మాట్లాడుతూ డబుల్ బెడ్ రూమ్ సౌకర్యం లేక గదులు కిరాయి తీసుకొని జీవించాల్సి వస్తుందని వెంటనే సమస్య పరిష్కరించాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ వీణ, తాసిల్దార్ సునీత, మండల ప్రత్యేక అధికారి శ్రీనివాస్, ఎంపీడీవో రాజ్ కిరణ్ రెడ్డి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ బాలయ్య, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి మహేష్ గౌడ్, పట్టణ ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు, గ్రామస్తులు, తదితరులు ఉన్నారు.  ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిశీలన….పట్టణ కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అడిషనల్ కలెక్టర్ విక్టర్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. వర్షాకాలంలో  సీజనల్ వ్యాధులు రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ప్రజలకు అందుబాటులో మందులు ఉండే విధంగా చూడాలన్నారు. ఆస్పత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి మెరుగైన వైద్యం అందించాలని మెడికల్ అధికారి యేమిమాకు తెలిపారు. ఈ పరిశీలనలో అడిషనల్ కలెక్టర్ వెంట హెచ్.ఈ.వో వెంకటరమణ, వైద్య సిబ్బంది, తదితరులు ఉన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -