– ఉమ్మడి ఆదిలాబాద్ ఆదివాసీలను వంచించిన కాంగ్రెస్ : బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
డిక్లరేషన్ల పేరుతో కాంగ్రెస్ అన్ని వర్గాలనూ మోసం చేసిందని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు. ఎస్సీ,ఎస్టీలకు సంబంధించి చేవెళ్లలో కాంగ్రెస్ అధ్యక్షులు మల్లిఖార్జునఖర్గే విడుదల చేసిన డిక్లరేషన్ కూడా మోసపూరితమేనని విమర్శించారు. బుధవారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కవ్వాల్, తడోబా టైగర్ జోన్ పరిరక్షణ పేరుతో తెచ్చిన 49 జీవోతో ఉమ్మడి ఆదిలాబాద్ ఆదివాసీలను కాంగ్రెస్ ప్రభుత్వం వంచించిందని అన్నారు. రాజ్యాంగంలో అనేక ఆర్టికల్స్ను ఈ జీవో ఉల్లంఘించిందని చెప్పారు. కేవలం ఏడు పులుల కోసం ఏడు లక్షల మంది ఆదివాసీ, గిరిజన గూడేల ప్రజలను నిర్వాసితులుగా చేసే కుట్రతోనే ఈ జీవోను తెచ్చారని ఆరోపించారు. వారు వ్యయసాయం చేసుకోలేకపోతున్నారని అన్నారు. ఆదివాసీల హక్కులకు భంగం కలిగిస్తున్నారని చెప్పారు. టైగర్ కన్జర్వేషన్ పేరుతో గిరిజన, ఆదివాసీ గూడేలను ఖాళీ చేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. కేసీఆర్ పోడు భూములకు పట్టాలిస్తే రేవంత్రెడ్డి ఆ భూముల నుంచి వెళ్లగొడుతున్నారని వివరించారు. ఇంద్రవెల్లిలో ఆదివాసీలను కాల్చిచంపిన పార్టీ కాంగ్రెస్ అని విమర్శించారు. పీసా చట్టాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఉల్లంఘించి 49 జీవోను తెచ్చిందన్నారు. ఆపరేషన్ కగార్ను వ్యతిరేకిస్తున్న రేవంత్రెడ్డి టైగర్ కన్జర్వేషన్ పేరుతో గిరిజన, ఆదివాసీలను ఎందుకు ఖాళీ చేస్తున్నారని ప్రశ్నించారు. 49 జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ సమస్యను మంత్రి సీతక్క పరిష్కరిస్తుందని అనుకుంటున్నామని అన్నారు.
చేవెళ్ల డిక్లరేషన్ మోసం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES