– అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు
– నేడు మంజూరు పత్రాలు :
గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
మాజీ మంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా దత్తత తీసుకున్న వాసాలమర్రి గ్రామాన్ని గాలికొదిలేశారని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. ఆ గ్రామంలోని అర్హులైన ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసినట్టు తెలిపారు. వారికి గురువారం మంజూరు పత్రాలను అందజేస్తామని తెలిపారు. కేసీఆర్ చేతిలో మోసపోయిన ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తున్నదని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కేసీఆర్ తన ఫామ్హౌస్కు వెళ్లేందుకు వీలుగా రోడ్డు విస్తరణ చేయడంతోపాటు దానికి ఇరువైపులా ఉన్న ఇండ్లను కూల్చివేసి పేదలకు నిలువ నీడ లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇండ్లు కోల్పోయి బాధితులు తాత్కాలికంగా గుడిసెలు, టెంట్లు వేసుకుని నివసిస్తున్నారని తెలిపారు. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ఇందిరమ్మ ప్రభుత్వం అక్కున చేర్చుకున్నదని గుర్తు చేశారు. సీఎం ఆదేశాల మేరకు వాసాలమర్రి గ్రామంలో సర్వే నిర్వహించి లబ్దిదారులను గుర్తించామని పేర్కొన్నారు. అర్హులైన 205 మందికి ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసినట్టు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా బండ సోమారం, సూర్యాపేట జిల్లా మోతే మండలంలోని విభలాపూర్లో గురువారం ఇందిరమ్మ ఇండ్ల పనులను పరిశీలించనున్నట్టు మంత్రి తెలిపారు.
వాసాలమర్రిని కేసీఆర్ గాలికొదిలేశారు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES