- Advertisement -
నవతెలంగాణ – పెద్దకొడప్ గల్ : మండలంలోని రైతులు జొన్నలు సాగు చేసి వాటిని విక్రయించిన ఇప్పటివరకు డబ్బులు రాకపోయేసరికి “జొన్నలు కొన్నారు సరే.. డబ్బులు ఏవి మరి?”అనే శీర్షికన గురువారం ప్రచురితమైన కథనానికి తెలంగాణ మార్క్ ఫెడ్ కామారెడ్డి అధికారులు స్పందించి ప్రభుత్వ మద్దతు ధర కింద జొన్న కొనుగోలుకు సంబంధించి ప్రభుత్వం నుండి మొదటి విడతగా రూ.20 కోట్ల విడుదల చేయడం జరిగిందని వీటిని నేరుగా రైతుల అకౌంట్లోకి జమ చేయడం జరుగుతుందని అధికారులు తెలిపారు. సమస్యల పరిష్కారానికి అధికారుల దృష్టికి తీసుకెళ్లిన నవతెలంగాణ దినపత్రికకు మండలంలోని ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.
- Advertisement -