Saturday, June 21, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కామ్రేడ్ కర్రె పాండరికి విప్లవ జోహార్లు

కామ్రేడ్ కర్రె పాండరికి విప్లవ జోహార్లు

- Advertisement -

నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్  : యాదగిరిగుట్ట మండలం మల్లాపురం శుక్రవారం, గ్రామ సీపీఐ (ఎం.ఎల్) న్యూడెమోక్రసీ సీనియర్ నాయకులు కామ్రేడ్ కర్రె పాండరి(పాండన్న)జూన్ 19న అనారోగ్యంతో అమరులైన విషయాన్ని తెలుసుకున్న సీపీఐ (ఎం.ఎల్) న్యూడెమోక్రసీ జిల్లా నాయకత్వం పాండన్న పార్ధీవ దేహంపై పూలమాలలు వేసి రెండు నిమిషాలు సంతాప సూచకంగా మౌనం పాటించి ఘనంగా విప్లవ జోహార్లు తెలియజేసింది. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ యాదాద్రి భువనగిరి జిల్లా నాయకులు బేజాడి కుమార్ మాట్లాడుతూ కామ్రేడ్ పాండన్న 1978-79 నుండి నాటి ఉమ్మడి సీపీఐ ఎం.ఎల్ నుండి తదనంతరం సీపీఐ (ఎం.ఎల్) న్యూడెమోక్రసీ, ప్రజా సంఘాలలో క్రియాశీలక పాత్రను పోషించాడు. అమరుడు కామ్రేడ్ కటకం అంజన్న సారథ్యంలో సాగిన భూస్వామ్య వ్యతిరేక,దున్నే వారికే భూమి పోరాటంలో, ప్రజలను వెంటాడుతున్న గ్రామంలో దొరలకు  భూస్వాములకు, జీతగాళ్లకు జీతాలు పెరగాలని, కూలీ రేట్లు పెంచాలని, రైతులకు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని, భువనగిరి ఆలేరు  నియోజకవర్గంలో రైతులకు సాగు తాగునీరు గంధమాల ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని అనేక ఉద్యమాలలో చురుకుగా పాల్గొనడం జరిగింది.

వివిధ రకాల సమస్యల పరిష్కారం కోసం జరిగిన రైతాంగ, ప్రజా ఉద్యమాలలో కామ్రేడ్ పాండన్న ముందు వరుసలో ఉన్నాడని అన్నారు. కామ్రేడ్ పాండన్న పార్టీ ఆలోచన విధానం వెలుగులో, నిబద్ధత కలిగిన ఆచరణతో కార్యకర్తగా,నాయకునిగా నిజాయితీగా ప్రజా విముక్తి మార్గంలో నడిచిన ఆదర్శవంతుడని కొనియాడారు. నేడు కేంద్రంలో నరహంతక బీ జే పీ మోడీ ప్రభుత్వం పిడికెడు మందిగా ఉన్న బడా కార్పోరేట్ సంస్థలకు, సామ్రాజ్యవాదులకు దేశ సంపదను ప్రధానంగా అటవీ ఖనిజ సంపద ను యదేచ్చగా కొల్లగొట్టుక పోవడానికి గేట్లు ఎత్తివేశాడని, దేశ సంపదను భావితరాలకు ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకోవాలి తప్ప దోచుకుపోవడానికి, దేశానికి విద్రోహం తలపెట్టే దేశ, ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తున్న ఆదివాసీలను, మావోయిస్టులను ప్రాణాలతో పట్టుకొని చిత్ర హింసలకు గురి చేసి దుర్మార్గంగా ఎన్ కౌంటర్ లని కథలల్లుతున్నారని, మావోయిస్టు లైన, ప్రజలు ఎవరైనా నేరం చేశారని తెలిస్తే చట్టబద్ధంగా అరెస్టు చేయకుండా, కోర్టుకు అప్షెప్పకుండా కాల్చిచంపారు.

ప్రజాస్వామ్య, రాజ్యాంగ, చట్ట విరుద్ధమైన ఆలోచనని అన్నారు. ఇలాంటి దుర్మార్గమైన పాలనను కొనసాగిస్తున్న ఆర్ ఎస్ ఎస్, బీ జే పీ మోడీ ఉద్దేశ పూర్వకంగానే వ్యవహరిస్తుందని ఈ సమయంలో కామ్రేడ్ కర్రె పాండన్న భౌతికంగా మన మధ్యన లేకపోవడం ప్రజా ఉద్యమాలకు తీరని నష్టమని అన్నారు. కామ్రేడ్ పాండన్న పార్థివ దేహాన్ని సందర్శించిన వారిలో సీపీఐ (ఎం.ఎల్) న్యూడెమోక్రసీ డివిజన్ కార్యదర్శి ఇక్కిరి సహదేవ్, ప్రజా సంఘాల జిల్లా, డివిజన్ నాయకులు మామిడాల సోమయ్య, కల్లెపు అడివయ్య, పద్మ సుదర్శన్, చిర బోయిన రాజయ్య, వగ్గు మల్లయ్య, బర్మ బాబు, గడ్డం నాగరాజు, ఇక్కిరి శ్రీనివాస్, చిర బోయిన కొమురయ్య, ఇక్కిరి సిద్దులు, మోటే అంజయ్య, కొంగరి సాయిరాం, గడ్డం మంకయ్య, గడ్డం యాదగిరి, గోవింద్ పరమేశ్, కళ్లెం బాల్ నర్సయ్య, కారింగ్ ల స్వామి, కళ్లెం శ్రీను తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -