– క్రీడలతో క్రమ శిక్షణ అలవర్చుకోవచ్చ
– బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకుడు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి
– యువతకు ఎస్ఆర్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో క్రికెట్ కిట్లు పంపిణీ
నవతెలంగాణ – రాయపర్త
యువత సమాజానికి ఆదర్శవంతంగా నిలవాలని ఎస్ఆర్ఆర్ ట్రస్ట్ చైర్మన్, బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకుడు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన యువతకు క్రికెట్ కిట్లు పంపిణీ చేశారు. పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు, బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… యువత సమాజంలో జరిగే విషయాలపై శ్రద్ధ చూపుతు సామాజిక సమస్యలపై అవగాహన కలిగి ఉండాలి అని హితవుపలికారు. యువత సమాజంలో వివిధ సామాజిక కార్యక్రమాల్లో పాల్గొని, ఇతరులకు సహాయం చేయడానికి ఉత్సాహం చూపాలి అన్నారు. దీనివల్ల సమాజంలో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది అని చెప్పారు. యువత తమ నైపుణ్యాలను ఉపయోగించి, ఆర్థికాభివృద్ధికి దోహదపడతారు అని వివరించారు. యువత రాజకీయాల్లో పాల్గొని, సమాజంలో మార్పు కోసం తమ గొంతు వినిపించాలి అని కోరారు. సమాజంలో యువత భాగస్వామ్యం లేనిదే అభివృద్ధి సాధ్యం కాదు అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, మాజీ జడ్పీటీసీ రంగు కుమార్ గౌడ్, ఎస్ఆర్ఆర్ ట్రస్ట్ వర్కింగ్ ప్రెసిడెంట్ రంగా రెడ్డి, రాష్ట్ర ఎస్టీ యూనియన్ ఉపాధ్యక్షుడు సురేందర్ రాథోడ్ నాయక్, మండల పార్టీ నాయకులు ఎలమంచ శ్రీనివాస్ రెడ్డి, కర్ర రవీందర్ రెడ్డి, గజవెల్లి ప్రసాద్, గబ్బేట యాకయ్య, ఎండీ యూసఫ్, సాయి గౌడ్, ముద్రబోయిన సుధాకర్, అక్బర్ చందు రాము, ఎల్లస్వామి, చందు సతీష్, ఉబ్బని సింహాద్రి, ఐత రవి, జాటోత్ అనిల్ తదితరులు పాల్గొన్నారు.
యువత సమాజానికి ఆదర్శంగా నిలవాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES