నవతెలంగాణ-నయీంనగర్
హనుమకొండ జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు కాల్ తీవ్ర కలకలం రేపింది. హనుమకొండ అదాలత్లోని జిల్లా కోర్టులో బాంబు పెట్టినట్టు శుక్రవారం మధ్యాహ్నం గుర్తు తెలియని వ్యక్తి డయల్ 100కి ఫోన్ చేసి చెప్పాడు. ఇలా బెదిరింపు కాలు రావడం ఇది మూడోసారి. వెంటనే అప్రమత్తమైన సుబేదారి పోలీసులు కోర్టు ప్రాంగణంలో తనిఖీలు నిర్వహించారు. బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్తో పరిశీలించారు. బాంబు కలకలంతో న్యాయవాదులు, లాయర్లు, సిబ్బంది తీవ్ర ఆందోళనకు గురయ్యారు. తనిఖీల్లో భాగంగా కోర్టు ఆవరణలో భద్రపరిచిన ఆరు డిటోనేటర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఈ డిటోనేటర్లను ఆత్మకూరుకు చెందిన ఓ కేసు విషయంలో గతంలో స్వాధీనం చేసుకున్నవిగా పోలీస్ వర్గాల సమాచారం.
ఈ డిటోనేటర్లకు సంబంధించిన కేసు కూడా గతంలోనే కోర్టు కొట్టేసినట్టు సమాచారం. దీంతో తాజాగా బాంబు బెదిరింపు కాల్కు ఈ డిటోనేటర్లకు ఎలాంటి సంబంధమూ లేనట్టు పోలీసులు తెలిపారు. ఫోన్ చేసిన గుర్తు తెలియని వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. తనిఖీల్లో భాగంగా మరే ఇతర బాంబు లేదని నిర్ధారణకు రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
హన్మకొండ జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES