- Advertisement -
నవతెలంగాణ – బెజ్జంకి : మండల పరిధిలోని దాచారం గ్రామానికి చెందిన రెవెన్యూశాఖ సహయకురాలు మంజుల గత కొద్ది నెలల క్రితం రొడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. స్థానిక బీఆర్ఎస్ నాయకుడు దీటీ రాజు ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు.శనివారం మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఇరువురి గృహాలను సందర్శించి బాధితులను పరామర్శించారు.ప్రమాద సంఘటనలకు గల కారణాలను తెలుసుకుని ప్రగాఢ సానుభూతి తెలిపారు.రాష్ట్ర నాయకులు బోయనిపల్లి శ్రీనివాస్ రావు,జిల్లా నాయకుడు కనగండ్ల తిరుపతి, మాజీ ఎంపీటీసీ ముక్కీస తిరుపతి రెడ్డి,శేఖర్ బాబు పరామర్శలో ఉన్నారు.
- Advertisement -