- Advertisement -
నవతెలంగాణ-మద్నూర్
కేంద్ర ప్రభుత్వం దేశంలోని అన్ని రాష్ర్టాలతో నిర్వహించ తలపెట్టిన సర్ (ఎస్ఐఆర్) ప్రక్రియకు పూర్తి సహకారం అందిస్తామని మండల పరిధిలోని తడిఇప్పర్గా సర్పంచ్ అశ్విని సుదర్శన్, సోమూర్ సర్పంచ్ సంగ్రామ్ పటేల్ లు అన్నారు. గ్రామాలలో చేపడుతున్న సర్ ప్రక్రియను శుక్రవారం బీఎల్ఓ లతో కలిసి ఇంటింటికీ తిరిగారు. ఈ క్రమంలో గ్రామస్తులకు అవగాహన కల్పించారు. అదేవిధంగా సర్ ప్రక్రియకు ప్రజలందరూ అందుబాటులో ఉండి సహకరించాలని కోరారు.
- Advertisement -



