Sunday, June 22, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అమాత్యుల నోట అబద్దాలు ఏలా..?

అమాత్యుల నోట అబద్దాలు ఏలా..?

- Advertisement -

రుణమాఫీ ఫై చర్చకు సిద్దమేనా..
మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి
నవతెలంగాణ – తొగుట
: దుబ్బాక ప్రజల సాక్షిగా జిల్లా ఇంచార్జి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అబద్దాలను, అసత్యాలను ప్రచారం చేశారని మండల బీఆర్ఎస్ పార్టీ అధ్య క్షులు జీడిపల్లి రాంరెడ్డి ఆరోపించారు. శనివారం తొగుటలో బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి మాట్లాడు తూ రుణమాఫీ, రైతు భరోసా పూర్తి చేశామని చెప్పిన మంత్రి ఆ మాటలను వెనక్కి తీసుకోవాల న్నారు. రుణమాఫీ పూర్తిగా చేయలేదని సాక్షాత్తు మంత్రులే మాట్లాడుతుండగా, పూర్తి చేశామని మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. రుణమాఫీ ఫై ప్రజల్లో చర్చకు సిద్ధమా అని ఆయన ప్రశ్నించా రు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అనర్హులకే పెద్ద పీట వేశారని, నిబంధనలు సడలించి అర్హులైన వారికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. యాసంగి రైతు భరో సా పూర్తి స్థాయిలో ఇవ్వాలని, రుణమాఫీ పూర్తి చేయాలని కోరారు. 

– చరిత్రలో నిలిచిపోయిన ఆచార్య జయశంకర్..

ప్రత్యేక తెలంగాణ సాధన కోసం మూడు దశల్లో పోరాటం చేసి, తన జీవితాన్ని తెలంగాణ సాకారం కోసం త్యాగం చేసిన దివంగత ప్రో జయశంకర్ సార్ చరిత్ర లో నిలిచిపోయారని మండల అన్నా రు. మండల కేంద్రంలో ప్రో జయశంకర్ వర్ధంతి సందర్బంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. తెలంగాణ కోసం జయశంకర్ సార్ ఎంతోమంది వ్యక్తులను కలిసాడని, ఎన్నో వేదికల మీద భావ వ్యాప్తి చేశా రని పేర్కొన్నారు. కెసిఆర్ నాయకత్వంలో తెలం గాణ సాధ్యమని నమ్మిన జయశంకర్ సార్ టీఆర్ఎస్ పార్టీకి సిద్ధాంత కర్తగా సేవలు అందిం చాడన్నారు. జయశంకర్ ఆశయ సాధనలో కెసిఆర్ ముందుకు సాగుతున్నారని ఆయన పేర్కొ న్నారు. కార్యక్రమం లో మాజీ మండల పార్టీ అధ్య క్షులు చిలువేరి మల్లారెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బక్క కనకయ్య, నాయకులు వేల్పుల స్వామి, నంధారం నరేందర్ గౌడ్, బోయిని శ్రీని వాస్, చెరుకు లక్ష్మారెడ్డి, మంగ యాదగిరి, పబ్బతి వెంకట్ రెడ్డి, తగరం అశోక్, రాజిరెడ్డి, నీల రాజ య్య, పర్శరాములు, బండారు స్వామి గౌడ్, సుతా రి రాములు, కొల శ్రీనివాస్,జహంగీర్, ఎంగలి నరేం దర్, సుతారి రాంబాబు తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -