షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన కాజీపేట న్యాయస్థానం
క్వారీ యజమానిని బెదిరించిన కేసులో ఊరట
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి/శంషాబాద్
గ్రానైట్ క్వారీ యజమానిని బెదిరించిన కేసులో అరెస్టు అయిన హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డికి ఊరట లభించింది. కాజీపేట రైల్వే న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేసింది. సుబేదారి పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి శంషాబాద్ రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కౌశిక్రెడ్డిని అరెస్టు చేసి హన్మకొండకు తరలించారు. శనివారం ఉదయం నుంచి సుబేదారి పోలీస్స్టేషన్లోనే ఆయనను ఉంచారు. అనంతరం కాజీపేట రైల్వే కోర్టులో హాజరుపర్చగా.. వాదోపవాదాల అనంతరం కోర్టు ముందుగా రిమాండ్ విధించి.. ఆ తర్వాత షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అంతకు ముందు ఉదయం బీఆర్ఎస్ నేతలు, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినరుభాస్కర్, చల్లా ధర్మారెడ్డి తదితరులు పోలీస్స్టేషన్కు వచ్చి ‘పాడి’ని కలిసి సంఘీభావం ప్రకటించారు. రెండు నెలల కిందట గ్రానైట్ వ్యాపారి కట్టా మనోజ్రెడ్డిని రూ.50లక్షలు ఇవ్వాలంటూ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి బెదిరించారని మనోజ్ సతీమణి సుబేదారి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం విదితమే. ఈ క్రమంలో సుబేదారి పోలీసులు ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిపై 308(2), (4), 352 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సుబేదారి పోలీస్స్టేషన్ నుంచి ఎమ్మెల్యే కౌశిక్రెడ్డిని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించి వైద్యపరీక్షలు చేయించారు. అనంతరం ఆయనను కాజీపేట రైల్వే కోర్టులో హాజరుపరిచారు.
సీఎం దిష్టిబొమ్మ దహనానికి యత్నం
సుబేదారి పోలీస్స్టేషన్ ముందు బీఆర్ఎస్ నాయకులు సీఎం రేవంత్రెడ్డి దిష్టిబొమ్మను ఆకస్మికంగా కారులో నుంచి దింపి దహనం చేసే క్రమంలో పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళనకారులను చెదరగొట్టారు. పలువురు కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.
ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి అరెస్ట్..బెయిల్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES