నవతెలంగాణ – హైదరాబాద్: ఉత్తరాఖండ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గంగోత్రి జాతీయ హైవేపై ఉన్న గంగనాని వద్ద బస్సు లోయలో పడింది. డ్రైవర్ కంట్రోల్ కోల్పోవడంతో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు మృతిచెందారు. మరో 24 మంది గాయపడ్డారు. గంగనానికి 50 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు చెప్పారు. కంట్రోల్ తప్పిన డ్రైవర్.. వాహనాన్ని క్రాష్ బారియర్లకు ఢీకొట్టాడు. లోయలో పడి ఓ చెట్టుపై ఆగిపోయింది. గంగోత్రి నుంచి ఉత్తరకాశీ వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. ఆ టైంలో ఆ బస్సులో 27 మంది ప్రయాణికులు ఉన్నారు. సరైన సమయంలో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. గాయపడ్డవారిని ఉత్తరకాశీ జిల్లా ఆస్పత్రి, భట్వాడి హెల్త్ సెంటర్కు తరలించారు.