నవతెలంగాణ – అమరావతి: శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట సమీపంలో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. బస్సు శ్రీకాకుళం నుంచి పాతపట్నం వైపు వెళ్తుండగా.. జాతీయ రహదారిపై కోమర్తి జంక్షన్ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. స్టీరింగ్ విరిగిపోవడంతో బస్సు అదుపు తప్పింది. ఈ ఘటనలో డ్రైవర్, కండక్టర్ సహా 19 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం కారణంగా హైవేపై వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్కు అంతరాయం కలిగింది.