Tuesday, August 26, 2025
E-PAPER
spot_img
Homeఆదిలాబాద్రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహిళ మృతి

రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహిళ మృతి

- Advertisement -

నవతెలంగాణ – జన్నారం: మండలంలోని కలమడుగు గ్రామంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇచ్చోడ మండలం లింగపూర్ గ్రామానికి చెందిన వనిత (34) మృతి చెందింది. బందువులు తెలిపిన వివరాల ప్రకారం.. వనిత తన తల్లి కస్తులపురి గంగ లక్ష్మితో కలిసి కలమడుగు గ్రామంలోని బందువుల ఇంటికి రోడ్డు పక్కన నడుచుకుంటు వెళ్తుండగా.. అతి వేగంగా ఆటో వచ్చి డికోనడంతో ఇద్దరికి గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం కరీంనగర్ ఆస్పత్రికి తరలించగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. మృతురాలి తల్లికి కాలు రెండు చొట్ల విరిగినట్లు తెలిపారు. మృతు రాలి భర్త గత కొన్ని సంవత్సరాల క్రితం రొడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు వారు తెలిపారు. మృతు రాలికి 13 సంవత్సరాల అన్వేష్, 10 సంవత్సరాల గణేష్ కుమారులు ఉన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad