నవతెలంగాణ – ధర్మారం
వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మదర్ ఇండియా ప్రోగ్రాం ఎంతో మంచి కార్యక్రమమని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో కరీం నగర్ లో మంత్రి నివాసంలో ఆదివారం మదర్ ఇండియా ప్రోగ్రాం పోస్టర్ ను కేంద్రమంత్రి బండి సంజయ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మదర్ ఇండియా లాంటి మంచి కార్యక్రమాలు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో చేపట్టడం ఎంతో సంతోషకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ అధ్యక్షులు ఇరుకుల్ల రామకృష్ణ, సెక్రటరీ గార్లపాటి శ్రీనివాస్, మదర్ ఇండియా ప్రోగ్రాం చైర్మన్ సిరిపురం రాజేష్, కో చైర్మన్ట్ ధర్మారం బ్రిలియంట్ విద్యాసంస్థల చైర్మన్ సిరిపురం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
మదర్ ఇండియా ప్రోగ్రాం మంచి కార్యక్రమం: బండి సంజయ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES