- Advertisement -
ఇంచార్జి కమీషనర్ సుజాతకు వీడ్కోలు
నవతెలంగాణ – అశ్వారావుపేట : రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నిర్వహించిన మున్సిపాల్టీ కమీషనర్ నియామకాల్లో అశ్వారావుపేట మున్సిపాల్టీ కి రెగ్యులర్ కమీషనర్ గా బి.నాగరాజు ను నియమించింది. ఆయన మంగళవారం అశ్వారావుపేట చేరుకుని విధుల్లో చేరారు. ప్రస్తుతం అశ్వారావుపేట ఇంచార్జి కమీషనర్ గా విధులు నిర్వహిస్తున్న కే.సుజాత ఆయనకు ఛార్జ్ అప్పగించారు. వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపాల్టీ లో సేనిటరీ ఇన్స్పెక్టర్ గా విధుల్లో ఉన్న బి.నాగరాజు పదోన్నతి తో కమీషనర్ గా అశ్వారావుపేట వచ్చారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే జారే ఆదినారాయణ సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి సుజాతకు వీడ్కోలు పలికారు.
- Advertisement -