Thursday, June 26, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గ్రామాల అభివృద్ధిలో పంచాయతీ కార్యదర్శులు , ఈజీఎస్ సిబ్బంది పనితీరు కీలకం

గ్రామాల అభివృద్ధిలో పంచాయతీ కార్యదర్శులు , ఈజీఎస్ సిబ్బంది పనితీరు కీలకం

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ : మండలంలోని గ్రామాల అభివృద్ధిలో గ్రామ పంచాయతీల కార్యదర్శిల పనితీరు ఈలకంగా ఉంటుందని జుక్కల్ ఎంపీడీవో శ్రీనివాస్ అన్నారు . బుధవారం నాడు మండల పరిషత్ కార్యాలయంలో ఇందిరమ్మ ఇండ్లు , ఈజీఎస్ , శానిటేషన్ ,   పంచాయతీ కార్యదర్శిలు , ఉపాధి హామీ సిబ్బంది శాఖల వారితో వారాంతపు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీడీవో శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ పథకంలో భాగంగా గృహ నిర్మాణాలు చేపడుతున్నాయని వాటిని ఎప్పటికప్పుడు లబ్ధిదారులకు సూచనలు చేస్తూ నిర్మాణాలను త్వరితగతిన  పనులు అయ్యేవిధంగా కార్యదర్శులు పనితీరును మెరుగుపరుచుకోవాలని తెలిపారు. పంచాయతీ రికార్డులను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసి తనిఖీలకు వచ్చిన అధికారులకు సమస్యలు లేకుండా రికార్డులు పరిశీలన ఉండాలని సూచించారు. గ్రామాలలో పారిశుధ్యం కార్యక్రమాలు నిరంతరం చేపట్టాలని అన్నారు. వర్షాకాలం ప్రారంభం ఉన్నందున సీజనల్ వ్యాధులు సోకకుండా శుభ్రత పాటించాలని , మౌలిక వసతులు సక్రమంగా సమస్యలు లేకుండా నిర్వహించాలని తెలిపారు. ఉపాధి హామీ జిల్లా క్వాలిటీ కంట్రోల్ అధికారి విప్లవ్ మాట్లాడుతు మండలంలో ఉపాధి హామీ పథకంలో చేపట్టిన అభివృద్ధి పనులైన సిమెంటు రోడ్లు , ఇతర పనులు నాణ్యతగా చేపట్టాలని తెలిపారు. ఒకవేళ పనులు నాణ్యత లోపంతో చేపడితే చర్యలు తప్పవని , సమస్యలు తలెత్తుతాయని ఈజీఎస్ అధికారులు పనులు చేపడుతున్నప్పుడు దగ్గరుండి నాణ్యతగా చేపట్టే విధంగా ఆలోచించి పనులను చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్ తో పాటు జిల్లా ఉపాధి హామీ క్వాలిటీ కంట్రోలర్ విప్లవ్ , ఎంపీ ఓ రాము , ఏ పీ ఓ తులసి రామ్ , ఈ సి స్వామి దాస్ , టి ఏ లు రమేష్ , అశోక్ గౌడ్ , రవీందర్ రెడ్డి , ఉపాధి హమీ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు .

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -