Thursday, June 26, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జర్నలిస్టుపై దాడి చేయడం సరికాదు

జర్నలిస్టుపై దాడి చేయడం సరికాదు

- Advertisement -

భూపాలపల్లి జిల్లా జర్నలిస్టులు
జిల్లా కేంద్రంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన 
నవతెలంగాణ – భూపాలపల్లి
: ములుగు జిల్లా తాడ్వాయి విలేఖరి శ్రీకాంత్ రెడ్డి పై కాంగ్రెస్ నాయకులు దాడి చేయడం సరికాదని భూపాలపల్లి జిల్లా కేంద్రం జర్నలిస్టులు మండిపడ్డారు. బుధవారం దాడిని నిరసిస్తూ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కూడలీలో నల్ల బ్యాడ్జీలు ధరించి  ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… పత్రికా స్వేచ్ఛను హరించే సంస్కృతి సరికాదన్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ నిస్వార్థంగా సేవలందిస్తున్న జర్నలిస్టుల హక్కులను కాలరాయాలని చూస్తే ఊరుకునేది లేదని వారు హెచ్చరించారు. అనంతరం భూపాలపల్లి జిల్లా అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ ను కలిసి దాడికి పాల్పడిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు సతీష్ కుమార్, మంతెన సమ్మయ్య, సారేశ్వర్ రావు, రవి భాస్కర్, తిక్క ప్రవీణ్, సామల శ్రీనివాస్, చెరుకు సుధాకర్, ఎడ్ల సంతోష్, శేకర్, కడ పాక రవి, అంబాల సంపత్, రడపాక రమేష్, చేని శ్రీనివాస్, వనం విజయ్ , రమేష్, రాజు, సుమన్, రాజశేఖర్. తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -