- Advertisement -
నవతెలంగాణ – దుబ్బాక : అన్నదాతల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ సర్కార్ పనిచేస్తుందని, సీఎం రేవంత్ రెడ్డి రైతు బాంధవుడు అని యూత్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు పడాల వినయ్ కుమార్ అన్నారు. రైతు భరోసా కింద రూ.9 వేల కోట్లను అన్నదాతల ఖాతాల్లో వేయడాన్ని హర్షిస్తూ.. బుధవారం దుబ్బాక మున్సిపల్ పరిధిలోని లచ్చపేట వార్డులో కాంగ్రెస్ నాయకులు, పలువురు రైతులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కాంగ్రెస్ 10,11 వార్డుల ఇన్చార్జిలు శ్రవణ్ గౌడ్, అన్వర్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు మాలి సత్యం, ధాత్రిక విజయ్, రైతులు పాల్గొన్నారు.
- Advertisement -