Friday, June 27, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మున్సిపల్ కమిషనర్ పై మాజీ కౌన్సిలర్ దౌర్జన్యం

మున్సిపల్ కమిషనర్ పై మాజీ కౌన్సిలర్ దౌర్జన్యం

- Advertisement -

పోలీసులకు పిర్యాదు చేసిన కమిషనర్ 
కేసు నమోదు..
నవతెలంగాణ – పరకాల 
: పరకాల మున్సిపల్ కమిషనర్ సుష్మపై పట్టణానికి చెందిన బిజేపి నాయకులు, మాజీ కౌన్సిలర్ ఆర్.పి జయంత్ లాల్ దౌర్జన్యానికి పాల్పడ్డగా కమిషనర్ సుష్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సిఐ క్రాంతి కుమార్ తెలిపారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు సిఐ కథనం మేరకు.. బుధవారం ప్రయివేటు వ్యక్తుల ప్రహరీ గోడకు సంబంధించిన వివాదంలో జయంతిలాల్ మున్సిపల్ కార్యాలయానికి వెళ్లి అక్కడ విధులు నిర్వహిస్తున్న బిల్డింగ్ ఇన్స్పెక్టర్ సందీప్ రెడ్డిపై దురుసుగా ప్రవర్తించడం జరిగిందన్నారు.

అనంతరం మీతో పనిలేదంటూ పరకాల పట్టణ మున్సిపల్ కమిషనర్ కడారి సుష్మ చాంబర్ కు అనుమతి లేకుండా తలుపులను తోసుకుంటూ చొచ్చుకు వెళ్లి అక్కడ విధుల్లో ఉన్న కమిషనర్ సుష్మను అనుచితమైన మాటలతో దూషించి, నువ్వు ఎట్లా జాబ్ చేస్తావో నీ అంతు చూస్తా అంటూ బెదిరింపులకు పాల్పడంతో పాటు అతనికి సంబంధం లేని విషయంలో గొడవకు పాల్పడ్డట్లు తెలిపారు. అంతేకాకుండా సూర రాజయ్య అనే వ్యక్తిని పురుగుల మందు డబ్బా ఇచ్చి తీసుకువచ్చి కార్యాలయం ముందు ఆత్మహత్యకు పాల్పడాల్సిందిగా ప్రోత్సహించినట్లు వెల్లడించారు. మున్సిపల్ మిషనర్ ఫిర్యాదు మేరకు ఆర్పీ జయంతులాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ వెల్లడించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -