లయన్స్ క్లబ్ స్నేహ గజ్వేల్ అధ్యక్షులు మల్లేశం
నవతెలంగాణ- రాయపోల్
విద్యార్థులు జీవితంలో నాయకత్వ లక్షణాలు పెంపొందించడానికి, ఉన్నత శిఖరాలకు చేరుకోవడానికి చదువుతో పాటు క్రీడలు కూడా ఎంతో ఉపయోగకరమని లయన్స్ క్లబ్ స్నేహ గజ్వేల్ అధ్యక్షులు మల్లేశం అన్నారు. గురువారం రాయపోల్ మండల కేంద్రంలో ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు లయన్స్ క్లబ్ స్నేహ గజ్వేల్ ఆధ్వర్యంలో క్రీడా సామాగ్రి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు ఆటలు సమానంగా చూడాలన్నారు. శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండాలి, ఆరోగ్య పరిరక్షణకు ప్రతిరోజు వ్యాయామం చేయాలన్నారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు హనుమంతు రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు క్రీడ సామాగ్రి అందజేసిన లయన్స్ క్లబ్ స్నేహ గజ్వేల్ వారిని ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థులు చదువుతోపాటు ఆటల్లో రాణిస్తే మానసికంగా శారీరకంగా దృఢంగా ఉండటంతోపాటు జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారన్నారు. చదువుకు, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రాముఖ్యత ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు ఎం. నాగరాజు,లైన్స్ క్లబ్ స్నేహ గజ్వేల్ ఉపాధ్యక్షులు డా. కుమారస్వామి, కోశాధికారి డి.సత్యనారాయణ, జోన్ చైర్మన్ నేతి శ్రీనివాస్, గ్రామ క్రీడాకారులు నరేష్, శ్రీకాంత్, పరశురాములు, నరేష్, పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలు ఎంతో ముఖ్యం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES