Sunday, June 29, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జూలై 7న ప్రతి గ్రామంలో ఎమ్మార్పీఎస్ జెండా ఎగరాలి

జూలై 7న ప్రతి గ్రామంలో ఎమ్మార్పీఎస్ జెండా ఎగరాలి

- Advertisement -

మాదిగ అమరులను స్మరించుకోవాలి 
ఎమ్మార్పీఎస్ ములుగు జిల్లా అధ్యక్షులు పుల్లూరు కరుణాకర్ 
నవతెలంగాణ – తాడ్వాయి 

జులై 7న ప్రతి గ్రామంలో ఎమ్మార్పీఎస్ జెండా ఎగరాలని, మాదిగ అమరులను స్మరించుకోవాలని ఎమ్మార్పీఎస్ ములుగు జిల్లా అధ్యక్షులు పుల్లూరు కరుణాకర్ మాదిగ అన్నారు. శనివారం మండలంలోని కాటాపూర్ గ్రామంలో ఎమ్మార్పీఎస్ నాయకుల అత్యవసర సమావేశం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథులుగా ఎమ్మార్పీఎస్  రాష్ట్ర ఉపాధ్యక్షులు, ములుగు జిల్లా ఇంచార్జిలు చాతాళ్ళ రమేష్ మాదిగ, తడుగుల విజయ్ మాదిగ లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. దీనికి సభాధ్యక్షులుగా ఎమ్మార్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి మండల ఇంచార్జ్ గజ్జల ప్రశాంత్ మాదిగ వ్యవహరించారు.

సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ సాధన కోసం మందకృష్ణ మాదిగ నేతృత్వంలో ఎమ్మార్పీఎస్ చేసిన 30ఏళ్ల పోరాటం విజయం సాధించిందని, ఈ సందర్భంగా జులై 7న రాబోతున్న ఎమ్మార్పీఎస్  ఆవిర్భావ దినోత్సవాన్ని పండుగలా  ఊరూరా పెద్ద ఎత్తున ఎమ్మార్పీఎస్ జెండాలను ఎగురవేసి ప్రతి గ్రామంలో సంబరాలు నిర్వహించుకోవాలని అన్నారు. ఎస్సీ వర్గీకరణ ద్వారా మాదిగలకు సంక్రమించిన 9% రిజర్వేషన్లను ఉపయోగించుకొని విద్యా, ఉద్యోగ రంగాల్లో రాణించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని చోట్ల ఎస్సీ వర్గీకరణ ప్రకారం కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వకుండా మాదిగలను ఇబ్బందులకు గురి చేస్తోందని అన్నారు. ఎస్సీ వర్గీకరణ చట్టం ప్రకారం కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జూలై ,7 న ప్రతి గ్రామంలో దండోరా జెండాను ఆవిష్కరించాలని అన్నారు.

ఎమ్మార్పీఎస్ గ్రామ కమిటీ ఎన్నిక 

అధ్యక్షులు  లంజపల్లి సత్యం మాదిగ,  ఉపాధ్యక్షులు పుల్లూరి రామస్వామి మాదిగ, ప్రధాన కార్యదర్శి పుల్లూరు చిరంజీవి మాదిగ, కార్యదర్శి మడిపల్లి సురేష్ మాదిగ, కార్యదర్శి దామెర స్వామి మాదిగ,ఆర్గనైజర్ మచ్చ సురేష్ మాదిగ,గౌరవ అధ్యక్షులు లంజపల్లి పెద్దబాబు మాదిగ, గౌరవాధ్యక్షురాలు పుల్లూరి గౌరమ్మ మాదిగ మాజీ సర్పంచ్, మహిళ అధ్యక్షులు మడిపల్లి స్వప్న మాదిగ,  ప్రధాన కార్యదర్శి పుల్లూరి రాధా మాదిగ లను గ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎం ఎస్ పి ములుగు జిల్లా అధ్యక్షులు మడిపల్లి శ్యాంబాబు మాదిగ, ఎం ఎస్ పి ములుగు జిల్లా అధికార ప్రతినిధి గజ్జేల ప్రసాద్ మాదిగ,  ఎం ఈ ఎఫ్ లంజపల్లి రాము మాదిగ,  మచ్చ సురేష్ మాదిగ, మచ్చ నవీన్, సత్యం, చిరంజీవి, బిక్షపతి, రామస్వామి, సోమయ్య, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -