Sunday, June 29, 2025
E-PAPER
Homeఖమ్మంలేబర్ కోడ్ లతో వెట్టిచాకిరికి ఊతం

లేబర్ కోడ్ లతో వెట్టిచాకిరికి ఊతం

- Advertisement -

కట్టు బానిసలుగా మారనున్న కార్మికులు…
సీఐటీయూ నాయకులు అర్జున్
నవతెలంగాణ – అశ్వారావుపేట
: లేబర్ కోడ్ లలో వెట్టిచాకిరికి ఊతం వచ్చినట్లే నని, అవి రాకముందే దేశ వ్యాప్తంగా కార్మిక వర్గంపై దాడి తీవ్రమైంది అని, తెలంగాణలో  సైతం 10 గంటల పని విధానానికి ఆమోదం తెలుపుతూ తెలంగాణ క్యాబినెట్ నిర్ణయించిందని అవి అమల్లోకి వస్తే కార్మికులు కట్టు బానిసత్వం లోకి నెట్టు వేయ బడతారు అని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు పిట్టల అర్జున్ అన్నారు. 

జులై 9 న తలపెట్టిన దేశ  వ్యాప్తంగా సార్వత్రిక సమ్మె విజయవంతానికి శనివారం మున్సిపాలిటీ,దుకాణసముదాయాల లో సమ్మె నోటీసులు ఇస్తూ కరపత్ర ప్రచారం నిర్వహించారు.  ఈ సందర్భంగా మున్సిపాలిటీ కార్యాలయం వద్ద సమ్మె నోటీసు మున్సిపల్ కమిషనర్ బి నాగరాజుకు అందజేశారు. ఈ సందర్భంగా అర్జున్ మాట్లాడుతూ..  ప్రభుత్వాలు అంటే సంపన్నులు పెట్టుబడిదారులు కోసమే అనే విధంగా ప్రభుత్వ పాలన నిరూపించు కుంటుందని, కార్మికులను ప్రజలను పట్టించుకోవడంలేదని అన్నారు.

ఆధునిక టెక్నాలజీ సాంకేతిక నైపుణ్యం మానవ పరిజ్ఞానం పెరిగిన నేపథ్యంలో పని గంటలు తగ్గించాల్సింది పోయి లేబర్ కోడ్ లు పేరుతో 12 గంటల పెంచటం అన్యాయమని అన్నారు. కోడ్ ల పేరుతో కార్మిక సంఘాలు రిజిస్ట్రేషన్ కఠిన తరం చేయటం కార్మిక సంఘాలను రద్దు చేయడం దారుణమని అన్నారు. కార్మికులకు కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాలని,ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను పునరుద్ధరించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల కన్వీనర్ కేసుపాక నరసింహారావు,మండల నాయకులు ఏసు, నాగేంద్ర శ్రీకాంత్, బుజ్జమ్మ‌, రాణి భూషణం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -