- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు : మండల కేంద్రమైన తాడిచర్లలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన నల్లగుంట స్వరూప, వొల్లాల కమలమ్మ తదితర మృతుల కుటుంబాలను మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మదుకర్ ఆదివారం పరమర్షించి, ఓదార్చారు. అధైర్య పడొద్దు బిఆర్ఎస్ పార్టీ అన్నివిధాలా అండగా ఉంటుందన్నారు. అనంతరం మృతుల చిత్రపఠాలకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కుంభం రాఘవ రెడ్డి, యూత్ అధ్యక్షుడు జాగరి హరీష్, బిఆర్ఎస్ నాయకులు యాదగిరి రావు,కామ బాపు,మేనం బాపు, మంథని సమ్మయ్య, మార్కు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -