నవతెలంగాణ – మల్హర్ రావు : రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు సూచనలు, డిసిసి అధ్యక్షుడు ప్రకాష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఆదేశాల మేరకు మండలంలోని ఆన్ సాన్ పల్లి కాంగ్రెస్ పార్టీ నూతన కార్యవర్గం నియామకం చేయడం జరిగిందని ఎన్నికల నిర్వాహకుడు, కాళేశ్వర దేవస్థాన డైరెక్టర్ నర్సింగరావు ఆదివారం తెలిపారు. గ్రామ శాఖ అధ్యక్షుడుగా భూక్య రఘునాయక్, ఉపాధ్యక్షుడుగా నాగుల రమేష్, ప్రధాన కార్యదర్శిగా దొంగల సంపత్, కార్యదర్శిగా సజ్జల తిరుపతి, సోషల్ మీడియా ఇంచార్జిగా తుప్ కారి సతీష్, సలహాదారుగా కాసర్ల రాజయ్య, ప్రచార కార్యదర్శిగా బూడిద వనమ్మ,కార్యవర్గ సభ్యులుగా ఓదెలు, సంతోష్, మల్లయ్య, రాజైలు ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గుగులోతు జగన్ నాయక్, మాజీ ఎంపిపి దులం సులోచన, కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆన్ సాన్ పల్లి గ్రామ కాంగ్రెస్ నూతన కమిటీ ఎన్నిక
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES