- Advertisement -
నేడు బీటి రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన
నవతెలంగాణ – మద్నూర్ : డోంగ్లి మండలంలోని ఇలేగావ్ గ్రామ ప్రజల కళ నెరవేర నుండి ఈ గ్రామానికి ఇప్పటివరకు బిటీ రోడ్డు లేక ఏళ్ల తరబడి నానా ఇబ్బందులు ఎదుర్కొంటూ వస్తున్నారు. ఇలాంటి ఇబ్బందులను దూరం చేసేందుకు జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు ఆ గ్రామానికి బీటీ రోడ్డు మంజూరు చేయించారు. ఈ నెల 30న ఉదయం 11 గంటలకు ఇలేగావ్ గ్రామానికి బీటీ రోడ్డు పనులు ప్రారంభించడానికి శంకుస్థాపన చేయనున్నారు. ఆ గ్రామ ప్రజల కళ నెరవేరనున్న సందర్భంగా ఆ గ్రామ ప్రజలు శంకుస్థాపన కోసం ఎదురుచూస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
- Advertisement -