- Advertisement -
టియుసిఐ జిల్లా ఉపాధ్యక్షులు ప్రకాష్
నవతెలంగాణ – భిక్కనూర్ : జులై 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని టియుసిఐ జిల్లా ఉపాధ్యక్షులు ప్రకాష్ పిలుపునిచ్చారు. మంగళవారం భిక్కనూరు పట్టణ కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్మికులు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె పోస్టర్లను ఆవిష్కరించారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక చట్టాలను తిప్పి కొట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్మికులు నాగభూషణం, బాలరాజు, జావేద్, నరేందర్, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -